ఓ మహిళ(woman) తన భర్తతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు. ఇక ఆన్ లైన్లో తనకు తగిన లవర్(lover) కోసం వెతకగా ఓ వ్యక్తి తగిలాడు. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తన ఖర్చుల కోసం నెలకు 60 వేల రూపాయలు కూడా ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ మహిళ వయసు 42 ఏళ్లు కాగా..ఇది తెలిసిన పలువురు మద్దతు చెబుతుండగా..మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.
సరికొత్త పథకంతో వచ్చింది ఏపీ సర్కారు. గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఈ పథకాన్ని ఉచితంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. టిఫా స్కాన్ అనేది బిడ్డ తల్లి కడుపులో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రక్రియ. ఇందులో బిడ్డ వృద్దిరేటు, ఆరోగ్యం, లోపాలను గుర్తించడానికి ఈ స్కానింగ్ ఉపయోగపడుతుంది. మామూలుగా ...
మహారాష్ట్రలోని అకోలాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఘర్షణల్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఎనిమిది మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకుని… వెంటనే 144 సెక్షన్ విధించారు. అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్టేషన్ పరిధిలో ఘర్షనలు మొదలైన వెంటనే.. ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగ...
అమెరికాకు చెందిన నటి మక్కెన్నా నైప్ 10 వేల ఫీట్ల ఎత్తులో స్కై డైవింగ్ చేస్తూ.. మేకప్ చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
కెన్యాలో డూమ్స్డే కల్ట్తో మరణించిన వారి సంఖ్య శనివారం 201కి చేరుకుంది. పోలీసులు మరో 22 మృతదేహాలను వెలికితీసిన తర్వాత, వారిలో ఎక్కువ మంది ఆకలి కారణంగా మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
ఈజీ మనీ కోసం ఆశపడ్డ అమ్మాయిలను ఓ తాంత్రికుడు మోసం చేశాడు. అంతేకాదు వారితో నగ్నంగా క్షుద్రపూజలు చేయించాడు. ఆ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి అనేక విధాలుగా చీట్ చేశాడు. తర్వాత ఆలస్యంగా మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లు ముందుంటారు. వీరి వివాహ బంధం ఇటీవల 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెళ్లై ఇంతకాలం అయినా వీరి బంధం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడిపోతున్నారంటూ ఎఫ్పుడూ ఏదో పుకార్లు వస్తూనే ఉంటాయి.
నెట్టింట అనసూయ చేసే హడావుడి గురించి అందరికీ తెలిసిందే. తానొక ట్వీట్ చేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అయ్యి ట్రోల్స్ చేయడం, ఆ తర్వాత తన మీదే ట్రోల్ చేస్తున్నారని అనసూయ మండిపడటం ఇదంతా గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.