ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. కట్నం తీసుకొని రావాలని వేధించగా.. తమ్ముని వద్దకు వెళ్లింది. ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి.. వచ్చిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంలో చేయి చేసుకొని హతమార్చాడు.
అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA), బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వలబాలరాజు (MLA Guvvala Balaraju)పై వరుస దాడులు జరుగుతున్నాయి.మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్ల విసిరాడు. అయితే బాలరాజు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈశాన్య రుతుపవనాల చురుకుగా మారినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.కేరళలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నవంబర్ 10వ తేదితో తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇకపోతే నేడు వాటిని ఈసీ పరిశీలించింది. 5563 అప్లికేషన్లు రాగా అందులో 2444 అప్లికేషన్లను మాత్రమే ఈసీ ఆమోదించింది. 594 మంది అప్లికేషన్లను ఈసీ రిజెక్ట్ చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరాయి రాష్ట్రం నుంచి వచ్చి డబ్బులు చల్లినంత మాత్రన ఎన్నికల్లో గెలవలేరన్నారు. షర్మిల తనపై పగబట్టిందని, నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ బీఆర్ఎస్లో విలీనం అయినట్లుగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. అయితే నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. నాగార్జునా సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మరోసారి తన నోటి దూలను ప్రదర్శించారు. తనకు ఓటేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, వారి పిల్లలకు నౌకరీ పెట్టిస్తామని సభలో ప్రకటన చేసి.. దుమారం రేపారు.
అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల నవంబర్ 30న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు.
అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడి ఘటన..అధికార పార్టీ డ్రామా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సర్వసాధారణమని గుర్తు చేశారు. అంతేకాదు గతంలో జగన్ మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేయడం, మమతా బెనర్జీ కాలికి గాయం వంటి ఘటనలను ప్రస్తావించారు.
బజార్ ఘాట్ ప్రమాదంలో ఓ నాలుగు రోజుల పసికందు చనిపోయింది. చిన్నారి చనిపోవడంతో బంధువులు, స్థానికులు రోదిస్తున్నారు. ప్రమాద స్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు.
మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలను ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు.గిరిజన బిడ్డపై సీఎం కేసీఆర్కి ఎందుకు ఇంత కక్ష అని ఆమె అన్నారు
సదర్ పండుగకు సిటీ రెడీ అయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సదర్ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిపే వేడుకలకు భాగ్యనగరం ప్రసిద్దిగాంచింది.
హైదరాబాద్లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది ఇప్పటికే కంటి సమస్యలతో హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రిల జాయిన్ అయ్యిన వారంత దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడినవారే.
హైదరాబాద్ నాంపల్లిలో గల బజార్ఘాట్ వద్ద గల అపార్ట్ మెంట్లో ఇవాళ ఉదయం 9.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.