జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జనవరి 26వ తేది నుంచి 31వ తేది వరకూ రెడ్ అలర్ట్ ను కొనసాగించనున్నారు. ఈనెల 31వ తేది వరకూ ఎయిర్ పోర్టులో సందర్శకులకు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకు...
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రప...
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్దరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన, పిట్టల అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి హైదరాబాద్లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధు తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమా...
హైదరాబాద్ లో వ్యాపారస్తులకు ఇది షాకింగ్ న్యూస్ వరుస ప్రమాదాల నేపధ్యంలో భాగ్యనగర లో వ్యాపారస్తులకు షాకిచ్చారు. ఇకపై వ్యాపారాలకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. దీంతో, ట్రేడ్, ఫుడ్, ఫైర్తోపాటు పోలీస్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిందే. గతంలోనూ పోలీస్ లైసెన్స్ విధానం ఉంది. అయితే, 2014 తర్వాత దీన్ని రద్దు చేశారు. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో పోలీస్ లైసెన్స్ నిబంధనలను పునరుద్ధరించారు. పోలీస్...
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు మెట్రో సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో. ఈ మేరకు మెట్రో ఛార్జీలపై ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అధ్యయనం చేస్తోంది....
హైదరాబాద్ వాసులకు భారత వాతవారణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రల్లో చలిపులి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. ఇక హైదరాబాద్ నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈ నెల 26 ...
వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 108 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ,గురువారాల్లో ఈ బస్సులు తిరుగనున్నాయి. బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, ...
అధికారం చేజిక్కించుకోవాలంటే యాత్ర చేపట్టాల్సిందేనని నేతలు విశ్వసిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రచార రథంతో కదం తొక్కారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల కింద వైఎస్ఆర్ చేపట్టిన యాత్రకు ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. 2003 ఏప్రిల్ 9వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు 68 రోజుల పాటు జనంతో ఉన్నారు. రంగారెడ్డి చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర 1500 కిలోమీటర్ల వరకు కొనసాగిం...
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రచార రథం వారాహికి పవన్ ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో మూడు ఆప్షన్లు తమకు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొండగట్టులో తొలిసారి వారాహి వాహనం ఎక్కి తన అభిమానులను, జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని బృందావనం రిస...
వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. పొంగులేటి పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో షర్మిలను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీతో పొంగులేటి అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఇటీవల ఖమ్మం గుమ్మంలో జరిగిన ఆవిర్భావ సభకు కూడా హాజరుకాలేదు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో ఆయనకు పొసగడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల...
అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్,...
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తన ఏపీ యాత్ర కోసం ఉపయోగించే ఎన్నికల రథం వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గా బీజ...
ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటా అని ఓ మహిళకు మాటిచ్చాడు. మాయ మాటలు చెప్పి తనతో సహజీవనం చేశాడు. ఇద్దరూ కొన్ని రోజులు కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆ మహిళను పక్కన పెట్టడం ప్రారంభించాడు అతడు. పెళ్లి చేసుకో అంటే మాట దాటేశాడు. చివరకు ఏం చేయాలో తెలియక తన గోడును కలెక్టర్ కు విన్నవించుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచలో నివాసం ఉండే […]
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పాదయాత్ర మళ్లీ స్టార్ట్ అవుతోంది. వరంగల్ ఘటనతో తెలంగాణలో ఆమె చేపడుతున్న పాదయాత్ర ఆగిపోయింది. షర్మిల కాన్వాయ్ పై దాడి చేయడం, ఆ కారుతోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లడం, అక్కడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం, స్టేషన్ కు తీసుకెళ్లడం, వంటివి చకచకగా జరిగిపోయాయి. ఈ క్రమంలో పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే తాజాగా.. ఈనెల 28 నుంచి పాదయాత్ర మళ్లీ ప్...
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ వేడుకకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఉ.11:30కి సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ఫిక్స్ చేశారు. ఆ రోజు మొదట వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు. ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం సొరేన్ హాజరుకానున్నరు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అ...