• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది’

జనగామ: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. నాగర్ కర్నూల్ ఘటనను నిరసిస్తూ.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, జఫర్గడ్ ఎమ్మార్వోకు సోమవారం వినతిపత్రం అందించారు. బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తూ, కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతుని మండిపడ్డారు.

February 23, 2026 / 04:13 PM IST

రైల్వే పెన్షనర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పీ. సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మండలోజు కృష్ణమూర్తి, కోశాధికారిగాక ఐలయ్య, ఉపాధ్యక్షులుగా హసన్ పాషా జీ. వెంకటనారాయణ ఎంపికయ్యారు.

February 23, 2026 / 04:12 PM IST

‘మహిళా కాంగ్రెస్ బలోపేతమే పార్టీ లక్ష్యం’

MLG: మహిళా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ప్రకటించారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఈ ప్రకటన చేశారు. మండల ఇంఛార్జీలు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు.

February 23, 2026 / 04:11 PM IST

‘కేరళ ఎన్నికలకు మూటలు పంపేందుకే సీఎం డ్రామా’

HYD: సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళ ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడానికి సీఎం దేవాదుల పనులను తెరపైకి తెచ్చారని, ఇది మైండ్ గేమ్ అని ఆయన మండిపడ్డారు. కేరళ ఎన్నికలకు రూ.1000 కోట్లు పంపడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు.

February 23, 2026 / 04:08 PM IST

‘కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి’

WNP: వీపనగండ్ల మండలంలోని సర్వే నెంబర్ 721లో 16 ఎకరాల 20 గుంటల భూమిని రాజకీయ నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని వనపర్తి ప్రజావాణిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

February 23, 2026 / 04:06 PM IST

కుమ్మెర ఘటనపై డీజీపీకి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు

NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష దాడి, శిశువు మృతి ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ.. నిందితుడైన సర్పంచిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించి, భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 04:05 PM IST

ఉత్తర్వులను రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి

NLG: జిల్లా డైట్ కాలేజీలో స్టాఫ్ ట్యూటర్‌గా జి.ప.పాఠశాల ఉపాధ్యాయుడికి ‘అపాయింట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్’ ఇవ్వడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) తప్పుబట్టింది. ప్రభుత్వ పోస్టుల్లో స్థానిక సంస్థల ఉపాధ్యాయులను నియమించడం చట్టవిరుద్ధమని తెలిపింది. కోర్టు తీర్పులు, సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న బదిలీని రద్దు చేయాలని కలెక్టర్‌కు ఇవాళ వినతి ఇచ్చారు.

February 23, 2026 / 04:04 PM IST

‘బెస్ట్ పైలట్’ అవార్డులు అందుకుంది వీరే..!

ADB: 102 అంబులెన్సు సేవల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన పైలట్లకు సోమవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న పైలట్లు హరి ఓం, ధన్ సింగ్ల సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని పీవో పేర్కొన్నారు.

February 23, 2026 / 04:01 PM IST

‘నూతన బస్టాండ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి’

KMM: ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కలెక్టర్‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు కోరారు. ఖమ్మంలోని నూతన బస్టాండ్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.

February 23, 2026 / 04:01 PM IST

ఎస్బీఐ ఎదుట గోల్డ్ లోన్ బాధితుల ఆందోళన

MNCL: చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట సోమవారం గోల్డ్ లోన్ బాధితులు ఆందోళన నిర్వహించారు. బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. గత ఏడు నెలల నుంచి తమ బంగారం తమకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాధితులకు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:58 PM IST

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా: పసుపులేటి వీరబాబు

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 21వ వార్డు కార్పొరేటర్ అధ్యక్షతన సుజాతనగర్‌లో నాయకులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గ్రంథాలయానికి కావలసిన మౌలిక వసతులపై చర్చించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని మండల ప్రజల సహకారంతో త్వరలోనే గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:57 PM IST

ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?

KNR: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్‌తో కలిసి 367 దరఖాస్తులు స్వీకరించారు.

February 23, 2026 / 03:51 PM IST

మార్చి 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు

WNP: మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజు వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు.

February 23, 2026 / 03:46 PM IST

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మహిళా గ్రామైక్య సంఘం నూతన భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడారం వీర్ పాల్, ఎంపీడీవో సుమలత టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఐకేపీ ఎపీఎం, మహిళా సంఘాల ప్రతినిధులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:44 PM IST

కాల్వ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌కు వినతి

SRCL: తంగళ్లపల్లి మండలంలోని కాలేశ్వరం ప్రాజెక్టు ఎల్‌ఎంసీ 11/6, 11/5, 11/4 కాల్వల పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మండల సర్పంచులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుర్మాని రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జ్యోతి అనిల్, అంచ శ్రీనివాస్ రెడ్డి, సాయికృష్ణ గౌడ్, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:43 PM IST