• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

స్వచ్ఛ రిక్షాలను అందజేసిన ఎమ్మెల్యే

HYD: యాకుత్‌పురా వ్యాప్తంగా చెత్త సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు MLA జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. బుధవారం రెయిన్బజార్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బందికి 35 చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. ఇవి చెత్త సేకరించినందుకు ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే మరో 15 రిక్షాలను అందజేయనున్నట్లు తెలిపారు. GHMC సహకారంతో ఇవి అందజేశామన్నారు.

January 29, 2025 / 07:36 PM IST

మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

JGL: మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బీ.సత్య ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెట్‌పల్లి మినీ స్టేడియం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలను సందర్శించారు. మినీ స్టేడియంలో నిలిచిపోయిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్‌లో బయో మైనింగ్ త్వరగా ప్రారంభించమని ఆదేశించారు.

January 29, 2025 / 06:00 PM IST

బీసీ రాజ్యాధికార సమితి ఇంఛార్జ్‌ల నియామకం

కామారెడ్డి: బీసీ రాజ్యాధికార సమితి జుక్కల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల నియామకాన్ని పిట్లం మండల కేంద్రంలో బుధవారం చేపట్టారు. జిల్లా ఇంఛార్జ్ అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి ఆధ్వర్యంలో జుక్కల్ కో‌‌–ఇంఛార్జ్‌లుగా మేకల లక్ష్మణ్ యాదవ్, పిట్లం మండలానికి చెందిన ఎర్ర రమేశ్లను నియమించారు. వారికి నియామకపత్రాలను అందజేశారు.

January 29, 2025 / 05:47 PM IST

కూకట్పల్లి PS పరిధిలో ఇద్దరు ఆత్మహత్య

మేడ్చల్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు(బుధవారం) ఇద్దరు ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. వివేకానందనగర్‌లో కృష్ణ చైతన్య రెడ్డి(34), మహంకాళినగర్ శంషీగూడలో నవీన్(18) అనే ఇద్దరు మృతి చెందారు. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

January 29, 2025 / 05:03 PM IST

మహాదేవపూర్‌లో రోడ్డు ప్రమాదం

BHPL: జాతీయ రహదారి 353(సీ)పై మహాదేవపూర్ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. కాటారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు, అతడి బంధువైన మరో వ్యక్తి‌తో కలిసి సూరారం వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి మైలురాయికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 29, 2025 / 04:51 PM IST

అధ్యాపక నియమకానికి దరఖాస్తు ఆహ్వానం

RR: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్/అప్లికేషన్ విభాగంలో అధ్యాపక నియామకం కోసం ఒక పోస్ట్ ఉన్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రాధిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పీజీ సబ్జెక్టులు 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు కళాశాల కార్యాలయం సంప్రదించాలన్నారు.

January 29, 2025 / 04:45 PM IST

మాధవి హత్య.. చర్లపల్లి జైలుకు గురుమూర్తి

మేడ్చల్: మాధవి హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు గురుమూర్తిని కోర్టుకు తరలించారు. భార్య మాధవిని చంపిన కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

January 29, 2025 / 04:43 PM IST

మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

MNCL: జన్నారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలలో భాగంగా మండలంలోని పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఆ ఇండ్ల నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టామని హౌసింగ్ ఏఈ రియాస ఆలీ తెలిపారు.

January 29, 2025 / 04:14 PM IST

‘విద్యతోనే అందరికీ గుర్తింపు’

ADB: విద్యతోనే సమాజంలో అందరికీ గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో, లాల్ టేక్డిలోని గిరిజన సంక్షేమ కళాశాలతో పాటు యేందా గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణానికి ఎంపీ నగేష్‌తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

January 29, 2025 / 04:02 PM IST

‘జన్నారం మార్కెట్‌లో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలి’

MNCL: ధర్మారం చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండు, ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్, నిర్మించాలి మండల కేంద్రంలో మంగళవారం సంత రోజు అత్యధికంగా ప్రజలు జన్నారం మెయిన్ రోడ్ ప్రాంతానికి వస్తుంటారు. మరుగుదొడ్లు లేక మహిళలు, విద్యార్థినులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సులభ్‌ కాంప్లెక్స్‌ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

January 29, 2025 / 03:50 PM IST

నిజామాబాద్ విద్యుత్ శాఖకు మూడో స్థానం

NZB: ఉత్తమ సేవలు అందించినందుకు గాను జిల్లా విద్యుత్ శాఖకు మూడో స్థానం దక్కిందని ట్రాన్స్‌కో ఆపరేషన్స్ ఎస్ఈ రాపల్లి రవీందర్ పేర్కొన్నారు. బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అశోక్ జిల్లా ఎస్ఈ బృందానికి బుధవారం నిజామాబాద్ నగరంలో సర్టిఫికెట్ అందజేశారు.

January 29, 2025 / 03:46 PM IST

విద్యాసంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

MNCL: మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలలు, బాలికల, మహిళా వసతి గృహాల వద్ద సీసీ టీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు తప్పనిసరి అని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. మహిళా విద్యా సంస్థల నిర్వాహకులతో బుధవారం ప్రభుత్వ మహిళా కళాశాలల నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బాలికల, మహిళల రక్షణ, మంచిర్యాల జోన్ పోలీస్ ప్రధాన బాధ్యత, లక్ష్యం అని స్పష్టం చేశారు.

January 29, 2025 / 03:36 PM IST

ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

PDPL: రోడ్డు భద్రతా మాసొత్సవాల సందర్భంగా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్‌లో బుధవారం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన ఆటోల ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

January 29, 2025 / 03:28 PM IST

‘మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారు’

NRML: ఖానాపూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారనీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పడాల లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ రాచమల్ల రాజశేఖర్ అన్నారు. రిపబ్లిక్ అవార్డులు పొందిన అవార్డు గ్రహీతలను బుధవారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు పాల్గొన్నారు.

January 29, 2025 / 03:12 PM IST

అధికారులపై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ సారయ్య

WGL: అజంజాహీ కార్మికుల భవన స్థలాన్ని కాపాడాలని, కబ్జాకోరులకు సహకరించిన మునిసిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని MLC బసవరాజు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అజంజాహీ మిల్ స్థలం ముమ్మాటికీ కార్మికులదే అని, జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసని, కానీ తప్పుడు పత్రాలు సృష్టించి, భవనం కూల్చారన్నారు.

January 29, 2025 / 03:10 PM IST