HYD: పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగని మల్కాజిగిరి ఎంపీ ఈటల సత్కరించారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నంపెట్టే ప్రజలకు అండగా మంద కృష్ణ నిల్చడని ఎంపీ ఈటల కొనియాడారు. జాతిని పైకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉండటం గొప్ప విషయమన్నారు. నమ్ముకున్న జాతిని, నమ్ముకున్న ఆశయాన్ని, గమ్యాన్ని ముద్దాడే వరకు వెనకడుగు వేయని వ్యక్తి అంటూ ఈటల పేర్కొన్నారు.
MDK: కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ కొల్చారం మండలంలో AEOగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. 5వ సారి జాతీయ స్థాయికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
HYD: నేడు జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. దీంతో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకాగానే ముందుగా గాంధీవర్ధంతి కావడంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తర్వాత బడ్జెట్ పై చర్చలు ప్రారంభించనున్నారు. సభ్యుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేయనున్నారు.
WGL: కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ నవీన్ రెజ్లింగ్లో 97కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన క్రీడాకారుడిపై విజయం సాధించి తొలి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతోపాటు జట్టు మేనేజర్ నాగయ్య నవీన్కు అభినందనలు తెలిపారు.
MDK: నార్సింగి మండలం శేరిపల్లి జడ్పీ పాఠశాల భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు తిరుపతి ఢిల్లీ సీసీఆర్టీ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఢిల్లీలో సీసీఆర్టీ శిక్షణ పూర్తి చేసుకున్న తిరుపతికి డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ చేతుల మీదుగా సర్టిఫికెట్ పొందారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ విద్యా భోధన తీరు, దేశంలో వివిధ ప్రాంతాల్లో థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్పై ఆవగహన కల్పించినట్లు తెలిపారు.
HYD: లక్ష డప్పుల వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సహకారం అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ను ఆయన నివాసంలో మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమానికి ఆహ్వానించారు.
WGL: జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2డి ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్ఓ సాంబశివరావు కోరారు.
KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడాకారులు వారి వారి క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. క్రీడా పోటీలను పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ప్రారంభించారు.
WGL: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేడు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. నర్సంపేట నియోజకవర్గంకి సంబంధించిన పలు విషయాలపై మంత్రి పొన్నం దృష్టికి తీసుకువెళ్లినట్లు MLA తెలిపారు. నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.
NZB: మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోర్గాం గ్రామానికి చెందిన స్వర్ణ, ఆమె భర్త పోతన్నకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. బుధవారం స్థానిక చెరువులో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
SDPT: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో చిన్నకోడూర్ మం. చౌడారం గ్రామానికి చెందిన రవి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. గతేడాది వెలువడిన పోలీస్ ఉద్యోగ ఫలితాల్లో పోలీస్ కానిస్టేబుల్, గ్రూపు-4(వార్డు ఆఫీసర్)గా, ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆర్అండ్ బీ ఏఈగా ఎంపికయ్యాడు.
HYD: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గొర్రె, మేకల మండీలను, దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
KMR: బాన్సువాడ పట్టణంలో గల సీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వంను కామారెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అయ్యాల సంతోష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్జీటీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యందు ఓటు హక్కు కల్పించాలని అన్నారు.
కామారెడ్డి పట్టణంలో ఆర్కే డిగ్రీ కళాశాలలో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ భద్రత అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, కామారెడ్డి పట్టణ సీఐ, దేవునిపల్లి ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలకు సంబంధించి పలు సూచనలు, ఏఎస్పీ సూచించారు.
HYD: నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బెగ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి కళాశాల భవనాలను పరిశీలించారు. కళాశాలలో మౌలిక వసతులపై అరా తీశారు. విద్యార్థుల హాజరు శాతంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.