HYD: లక్ష డప్పుల వెయ్యి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సహకారం అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ను ఆయన నివాసంలో మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమానికి ఆహ్వానించారు.
WGL: జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2డి ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్ఓ సాంబశివరావు కోరారు.
KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడాకారులు వారి వారి క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. క్రీడా పోటీలను పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ప్రారంభించారు.
WGL: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేడు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. నర్సంపేట నియోజకవర్గంకి సంబంధించిన పలు విషయాలపై మంత్రి పొన్నం దృష్టికి తీసుకువెళ్లినట్లు MLA తెలిపారు. నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.
NZB: మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోర్గాం గ్రామానికి చెందిన స్వర్ణ, ఆమె భర్త పోతన్నకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. బుధవారం స్థానిక చెరువులో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
SDPT: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో చిన్నకోడూర్ మం. చౌడారం గ్రామానికి చెందిన రవి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. గతేడాది వెలువడిన పోలీస్ ఉద్యోగ ఫలితాల్లో పోలీస్ కానిస్టేబుల్, గ్రూపు-4(వార్డు ఆఫీసర్)గా, ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆర్అండ్ బీ ఏఈగా ఎంపికయ్యాడు.
HYD: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గొర్రె, మేకల మండీలను, దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
KMR: బాన్సువాడ పట్టణంలో గల సీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వంను కామారెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అయ్యాల సంతోష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్జీటీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యందు ఓటు హక్కు కల్పించాలని అన్నారు.
కామారెడ్డి పట్టణంలో ఆర్కే డిగ్రీ కళాశాలలో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ భద్రత అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, కామారెడ్డి పట్టణ సీఐ, దేవునిపల్లి ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలకు సంబంధించి పలు సూచనలు, ఏఎస్పీ సూచించారు.
HYD: నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బెగ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి కళాశాల భవనాలను పరిశీలించారు. కళాశాలలో మౌలిక వసతులపై అరా తీశారు. విద్యార్థుల హాజరు శాతంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
HYD: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బోయిన్పల్లి మార్కెట్ వైస్ ఛైర్మన్ DB దేవేందర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను మార్కెట్ వైస్ ఛైర్మన్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను సన్మానించి, మిఠాయి తినిపించారు.
HYD: యాకుత్పురా వ్యాప్తంగా చెత్త సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు MLA జాఫర్ హుస్సేన్ మిరాజ్ తెలిపారు. బుధవారం రెయిన్బజార్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బందికి 35 చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. ఇవి చెత్త సేకరించినందుకు ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే మరో 15 రిక్షాలను అందజేయనున్నట్లు తెలిపారు. GHMC సహకారంతో ఇవి అందజేశామన్నారు.
JGL: మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బీ.సత్య ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెట్పల్లి మినీ స్టేడియం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలను సందర్శించారు. మినీ స్టేడియంలో నిలిచిపోయిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ త్వరగా ప్రారంభించమని ఆదేశించారు.
కామారెడ్డి: బీసీ రాజ్యాధికార సమితి జుక్కల్ నియోజకవర్గ ఇంఛార్జ్ల నియామకాన్ని పిట్లం మండల కేంద్రంలో బుధవారం చేపట్టారు. జిల్లా ఇంఛార్జ్ అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి ఆధ్వర్యంలో జుక్కల్ కో–ఇంఛార్జ్లుగా మేకల లక్ష్మణ్ యాదవ్, పిట్లం మండలానికి చెందిన ఎర్ర రమేశ్లను నియమించారు. వారికి నియామకపత్రాలను అందజేశారు.
మేడ్చల్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు(బుధవారం) ఇద్దరు ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. వివేకానందనగర్లో కృష్ణ చైతన్య రెడ్డి(34), మహంకాళినగర్ శంషీగూడలో నవీన్(18) అనే ఇద్దరు మృతి చెందారు. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.