KNR: శంకరపట్నం మండలం మక్త శివారులో శనివారం సాయంత్రం బైక్ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ముత్తారంకి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు, పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న మక్త గ్రామానికి చెందిన ఎలుకపల్లి నర్సమ్మను ఢీకొనడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో ఆసుపత్రికి తరలించారు.
BDK: గుండాల మండల కేంద్రంతో పాటు మామకన్ను గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యా చందన విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం స్థల సేకరణను శనివారం పరిశీలించారు. అనంతరం కాచనపల్లి, ముత్తాపురం, లింగగూడెం, రోళ్లగడ్డ, గుండాల గ్రామాల్లో నర్సరీలను సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, పాల్గొన్నారు.
SDPT: అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన బాకీ బిక్షపతి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా BRS సీనియర్ నాయకులు చింతల కుమార్, నాయకులు శనివారం బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు.
SDPT: సిద్దిపేటకు చెందిన మహిళ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో O పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని పోలీస్ మిత్రులు ద్వారా సమాచారం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ మహేశ్ వెంటనే స్పందించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేశారు.
మెదక్: రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. నాలుగో వార్డ్ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నట్లు తెలిపారు.
HYD: వెనుకబడిన BC వర్గాలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కొరకు తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జల సత్యం కోరారు. తెలంగాణ ప్రభుత్వమైన తీర్మానం ప్రవేశపెట్టి బీసీల పక్షాన నిలబడాలని కోరారు.
MNCL: జన్నారం మండల ఇన్చార్జి ఎంపీడీవోగా ఉమర్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు జన్నారం మండల ఎంపీడీవోగా పనిచేసిన శశికళ ఠాకూర్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆమె స్థానంలో హాజీపూర్ ఇంఛార్జ్ ఈఓపిఆర్డిగా పనిచేస్తున్న ఉమర్ షరీఫ్ ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంఛార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను పలువురు అభినందించారు.
ASF: కాగజ్నగర్లో నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ రామానుజన్ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్నగర్లోని శ్రీబాబు కాలనీ, మారుతీనగర్లో శనివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఆయన మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్లు, ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు.
NLG: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలు ముగిసిన నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్లకు HYDలోని TG భవన్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ను కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ MLA చిరుమర్తి లింగయ్యలు శాలువాలు మెమెంటులతో సత్కరించారు.
MDK: కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన చిలిపి చెడు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. సోమక్కపేటకు చెందిన రైతు శేరి అర్జున్ గొర్రెల పెంపకంపై జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడం వలన 8 గొర్రెలు మృతిచెందగా, 12 గొర్రెలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. రైతును ప్రభుత్వం అదుకోవాలని తోటి రైతులు కోరారు.
NLG: మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ ఆధ్వర్యంలో శనివారం UTS మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానంపై రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రైల్వే ప్రయాణికులు క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగతిన టికెట్ తీసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన మహిపాల్ ఓ ఛానెల్లో కెమెరా మెన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అలీసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
HYD: సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు.
WGL: తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవల మరణించిన మేడిపల్లి కిరణ్ కుటుంబాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి పరామర్శించారు . కిరణ్ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వినయ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రతాపరెడ్డి, బచ్చు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
SRPT: కోదాడ మున్సిపల్ ఛైర్మన్గా నాలుగు సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వహించిన వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాదులో వారి పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. కోదాడ పట్టణ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.