KCR: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రోజు సూర్యపేట నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం భువనగిరి జిల్లాలో రోడ్డు షోతో పాటు పబ్లిక్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఈ మార్గమధ్యంలో అర్వపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లోని ప్రజలు కేసీఆర్కు ఘనస్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్కు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ క్యామ మల్లేష్కు మద్దతుగా రోడ్డు షో నిర్వహిస్తున్నారు.
చదవండి:Kavitha : బీఆర్ఎస్ నేత కవిత బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తి.. మే 6న నిర్ణయం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 24 నుంచి మిర్యాలగూడలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర సిద్దిపేటలో ముగుస్తుంది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్డు షోలు ప్లాన్ చేశారు. ఈ యాత్రలో రైతులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలపై ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ రోడ్డు షో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చదవండి:CRPF DSP : ప్రమాదవశాత్తూ గన్ పేలి సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి