MHBD: గార్ల మండలం పాకాల గ్రామ సమీపంలోని స్మశాన వాటికలో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా, గదులు శిథిలావస్థలో ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతులు లేక దహన సంస్కారాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహించారు. అధికారులు తక్షణం స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని ఆదివారం కోరారు.