మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, గురువారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ని కలిశారు. పట్టణంలోని రామచంద్రాపురంలో సత్యవతిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వారు ఆమెకు వివరించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆమె నాయకులకు సూచించారు.