MNCL: చెన్నూర్కు చెందిన లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఏల్పుల పోచం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లైవ్ డ్రాయింగ్ యాత్ర పూర్తి చేసిన తొలి ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గాంచారు. భారతదేశ నలుమూలల తిరుగుతూ చిత్రకళ ద్వారా ప్రాచీన ప్రస్తుత వారసత్వ సంపదను, లైవ్ డ్రాయింగ్ అధ్యయనం చేసి రికార్డు నెలకొల్పాడు.