MDCL: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న జె. సురేష్, జె. శాంతి దంపతులు స్థానికుల వద్ద చిట్టీలు, అధిక వడ్డీ ఆశచూపి సుమారు రూ. 3 కోట్లకు పైగా వసూలు చేశారు. గత రాత్రికి రాత్రే అద్దె ఇంటికి తాళం వేసి, తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పత్తా లేకుండా పోయారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.