ADB: తాంసి మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. హస్నాపూర్ సర్పంచ్గా ఎల్టీ లింగారెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కుంబాజి మోహన్పై 157 ఓట్ల తేడాతో గెలుపొందారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 3 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.