NLG: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల జీ.ఓ 252 గందరగోళంగా ఉందని, దానిని తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి మూడ వేణు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిట్యాలలో ఇవాళ మీడియా సమావేశంలో తెలిపారు. జర్నలిస్టులు పాల్గొనాలని కోరారు.