SRPT: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ అధికారులకు సూచించారు. చివ్వెంల మండలం చందుపట్లలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వేసవిలో నీటి ఎద్దడి నెలకొనే ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈఈ శ్రీనివాసరావు , డీపీఓ నారాయణరెడ్డి ఉన్నారు.