KMM: మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాట్టా రాగమయి అన్నారు. ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్థికమేధావి మన్మోహన్ సింగ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.