HYD: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆధ్వర్యంలో మంగళవారం దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్లో ‘ప్రజల ఆకాంక్షలు ఏడాది ప్రభుత్వ పాలన’ అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. TUWJ రాష్ట్ర అధ్యక్షుడు కే.విరహత్ అలీ మోటివేటర్గా వ్యవహరించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో OU జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మ షాతో పాటు మేధావులు పాల్గొన్నారు.