NZB: వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ మేరకు గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి నగరంలోని వినాయక్ నగర్లో ఉన్న గణేష్ నిమజ్జన బావిని పరిశీలించారు. బావి ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.