ADB: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులకు గంటలోపు జీవో విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సర్వ శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.