SRD: తెలంగాణ తల్లి విగ్రహరూపరేఖలను ప్రభుత్వం మార్చడం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూరలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రూపొందించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.