నల్గొండ: 17 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,111 మంది ఉద్యోగులు శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. సమగ్ర శిక్షఉద్యోగులు ఇవాళ నుంచి 100% సమ్మెలో పాల్గొంటామని ప్రకటించడంతో విద్యార్థుల పర్యవేక్షణతో పాటు పాఠాలు ఏర్పాట్లు చేసింది.