SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం నుంచి కోడూరు-కొమ్మాల మధ్య జరుగుతున్న రోడ్డు పనులు మంగళవారం ఎమ్మెల్యే సామేలు పర్యవేక్షించారు. రోడ్డుకి ఇరువైపులా నిర్మించిన బ్రిడ్జిలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో కూడిన రోడ్డు వేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిషేక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.