JGL: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.72,46,017 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.62,348, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.19,140, అన్నదానం రూ.11,339, హుండీ ద్వారా రూ.71,53,190 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా తెలిపారు.