JN: ఈనెల 29న వరంగల్ ఉర్సుగుట్ట నుంచి భట్టుపల్లి వెళ్లే రహదారిలో ‘యేసు తిరు హృదయ దేవాలయ కొత్త పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చర్చి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవరెడ్డిని వారు ఆహ్వానించారు. ఈరోజు ఉదయం ఛైర్మన్ కార్యాలయంలో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.