WGL: మావోయిస్ట్ పార్టీ నిన్న విడుదల చేసిన లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. తన మూలాలు, పోరాటాలు మరిచి పోలేదని స్పష్టం చేశారు. ఆదివాసీ గిరిజనులపై కొందరు ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహంతో దాడులు చేశారని తెలిపారు. వారి భూముల జోలికి ఎవరు పోలేదని, జీవో 48ను ఖండించి రద్దు చేయాలని అందరూ ట్రైబల్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తీర్మానం చేయించామని పేర్కొన్నారు.