HYD: బేగంబజార్ PS పరిధిలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది. ఇన్స్పెక్టర్ బాలకృష్ణా గౌడ్ వివరాల మేరకు.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వి.సౌమ్య (21) నాంపల్లిలో డిగ్రీ చదువుతోంది. కాలేజ్ సమీపంలోని ఓహాస్టల్లో ఉంటోంది. ఈ నెల 15న తల్లికి ఫోన్ చేసి 3 రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పింది. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.