కృష్ణా: నాగాయలంక మండలం పాత ఉపకాలి గ్రామస్తులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటరు ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేశారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జ్ఞాపకార్థం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన మండలి ఫౌండేషన్ ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పర్యవేక్షించారు.