CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీవిరుపాక్షి మారెమ్మకు ఆషాడ మాసంలో తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహాన్ని అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించారు. అమ్మవారిని పసుపు, కుంకుమ, ఈత పళ్ళతో, మామిడికాయలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు .