NGKL: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కేసరి సముద్రం అలుగు పారుతోంది. ఈ సందర్భంగా అలుగు ప్రాంతాన్ని BJP పట్టణ అధ్యక్షుడు చావా ప్రమోద్ కుమార్ సందర్శించారు. ఏటా వర్షాకాలంలో అలుగు పారడంతో ఎండబెట్ల, ఐతోలు, సిర్సవాడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. సమస్యను పరిష్కరించకపోతే ధర్నా దిగుతామని తెలిపారు.