AP: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వద్ద ఉన్న ఓ నీటి కుంటలో ఆడుకునేందుకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు అందులో పడిపోయారు. ఆరుగురు నీటిలో పడి మృతి చెందారు. మృతులంతా ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.