SRD: మునిపల్లి మండలం చిలపల్లిలో జరిగిన భూ వివాదంలో అన్న తమ్ముడిని చంపాడని ఎస్సై రాజేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యాదయ్య తమ్ముడు శివయ్య (37)ను బండరాయితో కొట్టి చంపినట్లు తెలిపారు. శివయ్య తండ్రి పేరున ఉన్న భూమిని తండ్రి చనిపోగానే అన్నయాదయ్య తన పేరుపై చేసుకొని తమ్ముడికి డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తమ్ముడు పైసలు అడుగుతున్నాడని చంపేశాడన్నారు.