BDK: కిన్నెరసాని నుంచి పాల్వంచ కేటీపీఎస్కు నీటిని సరఫరా చేసే కాల్వలో శుక్రవారం ఓ మొసలి ప్రత్యక్షమయ్యింది. అది రిజర్వాయర్ నుంచి కాల్వలోకి ప్రవేశించడాన్ని కొందరు పర్యాటకులు గుర్తించి వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. రేంజర్ కవితా మాధురి సిబ్బంది కిషన్, రాములు తదితరులతో వెంటనే వచ్చి వలలతో మొసలిని బంధించారు. అనంతరం జలాశయంలోకి వదిలారు.