ASR: ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పాఠశాలలను నిర్వహించాలని సామాజక తనిఖీ ఎస్ఆర్పీ వెంకటరమణ సూచించారు. జీ.మాడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సామాజక తనిఖీ నిర్వహించారు. పాఠశాల నిర్వహణ వివరాలను సేకరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు.