SKLM: కాజీపేట లో జరిగిన కొట్లాట కేసు విషయంలో పొందూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్లను ఎస్పీ మహేశ్వర రెడ్డి సస్పెండ్ చేశారు. మూడు రోజుల కిందట గ్రామంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కొట్లాట జరగటానికి కానిస్టేబుళ్ల నిర్లక్ష్యమే కారణమని నిర్ధారిస్తూ ఎస్పీ వారిని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు.