HYD: ఏసుక్రీస్తు బోధనలు మానవాళిని సన్మార్గంలో నడిపిస్తాయని, ఏసు సూక్తులు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచం మొత్తం ఎంతో గొప్పగా జరుపుకొనే ఏకైక పండుగ క్రిస్మస్ అని ఆయన పేర్కొన్నారు.