కామారెడ్డి: మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని TPTF రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. నేడు జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో TPTF కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపుగా 9నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి అన్నారు.