KMM: పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆర్పీలను శుక్రవారం మధిర పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వెళుతున్న తమను అదుపులోకి తీసుకోవడం సరికాదని ఆర్పీలు మాధవి, కృష్ణవేణి అన్నారు.