BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలను ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు తదితర విభాగాల నుంచి మొత్తం కలిసి రూ.14,48,189 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.