BDK: చర్ల ప్రభుత్వం మంజూరు చేసిన 108 వాహనాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు అన్నారు. సత్యనారాయణపురం పీహెచ్సీలో 108ను ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ వాహనాన్ని మంజూరు చేసిందన్నారు.