KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రకటించారు. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,700లు, కొత్త మిర్చి ధర రూ.15,849లు పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200లు జెండా పాట పలకగా.. నిన్నటితో పోల్చితే కొత్త మిర్చి ధర రూ.252లు తగ్గగా అటు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.