NLG: కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుచున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా మూడవరోజు బుధవారం అమ్మవారు ‘అన్నపూర్ణ దేవి’ గా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం.