ADB: కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1000 కోట్లతో కుమ్మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకులు కోడూరు చంద్రయ్య కోరారు. మంగళవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. కుమ్మరి కులస్తులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని, కుమ్మరి వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన కుమ్మరి కులస్తులకు ప్రభుత్వం రూ.5000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.