HYD: స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కోసం పెత్తందారీ వ్యవస్థపై రాజీలేని పోరాటం చేసిన పండుగ సాయన్న పోరాట పటిమ భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ కార్యదర్శి దోమ మోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం తలకొండపల్లిలో పండుగ సాయన్న వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.