KMR: ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా డోంగ్లి మండలంలోని సిర్పూర్ మండల సరిహద్దులో ఎన్నికల తనిఖీల చెక్ పోస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ చెక్పోస్టును బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు నిర్వహణలో ఉన్న అధికారులకు పకడ్బందీ ఆదేశాలు జారీ చేశారు.