SRPT: తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని అనంతగిరి మండలం ఖానాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటయ్య అన్నారు. బుధవారం ఖానాపురం గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించి, గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందే సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు.