NZB: రాష్ట్రంలో ప్రజా కంటకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మాజీ MLA నల్లమడుగు సురేందర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలను మార్చడాన్ని నాకు నిరసనగా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మంగళవారం గత తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాన్ని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.