WGL: బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో మంగళవారం ఖిలా వరంగల్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించడం బాధాకరమన్నారు.