SRPT: తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా నరసింహారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు.