KNR: మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నతుడు పండిట్ దీన్ దయాల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.